BREAKING : బద్వేల్ లో వైసీపీ ఘన విజయం

-

బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో అందరూ ఊహించిందే జరిగింది. ఈ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. బద్వేల్‌ ఉప పోరు లో అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఘన విజయం సాధించారు. 10 రౌండ్లు ముగిసే సరికి అధికార వైసీపీ పార్టీ కి ఏకంగా 85,505 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

దీంతో అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఘన విజయం సాధించారు. అయితే… దీనిపై ఎన్నికల అధికారులు… అధికారికంగా ప్రకటంచాల్సి ఉంది. మరి కొన్ని క్షణాల్లోనే… ఫలితంపై ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ ఉప పోరులో 16 రౌండ్లు ఉండగా.. 10 రౌండ్‌ కే ఫలితం తేలడం గమనార్హం. మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలు నమోదు చేస్తున్న వైసీపీ… లక్ష మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు వైసీపీ అభ్యర్థి దాసరి సుధ. దీంతో తాడేపల్లి వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సాహం మిన్నంటింది. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయోత్సవ వేడుకల్లో మంత్రి వేణుగోపాల్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, సుధాకర్ బాబు, ఇతర నేతలు పాల్గొన్నారు.

2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని దాటి వైసీపీ పార్టీ అభ్యర్ధి డాక్టర్ సుధ రికార్డు సృష్టించారు. 2019 ఎన్నికల్లో 44, 734 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందిన వైసీపీ పార్టీ… ఈ సారి ఆ రికార్డు ను ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో బ్రేక్‌ చేసింది

Read more RELATED
Recommended to you

Latest news