హుజూరాబాద్ అప్డేట్: నాలుగో రౌండ్లో కూడా ఈటెలకే ఆధిక్యం..!

-

హుజూరాబాద్ లో రౌండ్ రౌండ్ కు బీజేపీ తన అధిక్యతను పెంచుకుంటూ పోతోంది. గ్రామాలు, మున్సిపాలిటీలు అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో బీజేపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. గత రెండు రౌండ్ లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓట్లు లెక్కించారు. మూడు, నాలుగు రౌండ్ లో హుజూరాబాద్ పట్టణ ప్రాంతం ఓట్లను లెక్కించారు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంటూ వచ్చింది. తాజాగా 4వ రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు   లీడ్ వచ్చింది. నాలుగో రౌండ్ లో బీజేీపీకి  562 ఓట్ల ఆధిక్యం వచ్చింది. తాజాగా నాలుగు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు 1835 ఆధిక్యత రాగా.. ఫలితంగా బీజేపీ పార్టీకి మొత్తం నాలుగు రౌండ్లకు కలిపి 17,969 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 16114 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకీ 680 ఓట్లు మాత్రమే వచ్చాయి.

 

రౌండ్ల వారీగా బీజేపీ ఆధిక్యం

మొదటి రౌండ్-166

రెండో రౌండ్- 193

మూడో రౌండ్-911

నాలుగో రౌండ్ – 562

Read more RELATED
Recommended to you

Latest news