రాజమహేంద్రవరం లో ఉద్రిక్తత.. మహాసేన రాజేష్ పై వైసీపీ కార్యకర్తల దాడి

-

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నందంగనీరాజు జంక్షన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నాయకుడు శ్రీను పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ వేడుకలకు మహాసేన రాజేష్ హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతని కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో రాజేష్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

పోలీసుల సమక్షంలోనే దుర్భాషలాడుతూ కారుపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. అప్రమత్తమైన పోలీసులు అతి కష్టం మీద రాజేష్ ని అక్కడి నుండి పంపించేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే తమ పార్టీ నేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజేష్ పై దాడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news