BREAKING : యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి పార్టీ కీలక నేత యడ్యూరప్ప ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కాసేపటి క్రితమే… మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది సౌందర్య.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఉరి వేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం కర్ణాటకలోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో సౌందర్య డాక్టర్ గా పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఆమె మృతికి కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సంఘటన తెలియగానే యడ్యూరప్ప కుటుంబం తీవ్ర విషాదం లోకి వెళ్ళింది. అటు మనవరాలు మృతి విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు మాజీ సీఎం ఎడ్యూరప్ప. ఇక సౌందర్య అంత్యక్రియలు రేపు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news