ఎల్లో మీడియా, కూటమి పార్టీలు గాడిదను గుర్రంలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి : సీఎం వైఎస్ జగన్

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై సీఎం జగన్ సంచలన చేశారు.జాబు రావాలంటే.. బాబు రావాలంటూ భ్రమ కల్పిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 12వ రోజు బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్‌ బైపాస్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… మనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోందన్నారు. ‘చంద్రబాబు ఎన్నికల ముందు గంగ.. ఆ తర్వాత చంద్రముఖి. ఆయన హయాంలో అసలు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.

మా ప్రభుత్వంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే.. జగన్ కావాలి. జాబుల విషయంలో బాబుది బోగస్ రిపోర్ట్ అని మండిపడ్డారు. ఎల్లో మీడియా, కూటమి పార్టీలు గాడిదను గుర్రంలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి’ అని సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబే. ‘కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు” అంటూ సీఎం జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news