‘లకలక అంటూ రక్తం తాగుతారు’.. చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై సీఎం జగన్ సంచలన చేశారు.పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ‘మేమంతా సిద్ధం’ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ…జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పుకొట్టాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దుష్టకూటమి నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు. ఈ ఎన్నికలు 58 నెలల అభివృద్ధికి అద్దం పట్టేవి.. ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలని జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో నాది ఎప్పుడూ పేదల పక్షమేనని.. తనకు ఓటేస్తేనే ఇప్పుడు జరుగుతోన్న మంచి కొనసాగుతుందని వైఎస్ జగన్ తెలిపారు.

పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గంగలా ఉంటారు.. అధికారం వచ్చిన తర్వాత చంద్రముఖిలా మారుతారని ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమి పవర్‌లోకి వస్తే లకలక అంటూ పేదల రక్తం తాగుతారని చంద్రబాబు నాయుడు ని విమర్శించారు. 30 ఏళ్లుగా కుట్ర, అబద్ధపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news