నిన్నటి ‘ప్రజాగళం’ పూర్తిగా విఫలం: సజ్జల రామకృష్ణారెడ్డి

-

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక …..చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సభ పై సంజల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.పదేళ్ల తర్వాత కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

‘ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడం.. హామీలు ఇవ్వడం వీరికి అలవాటుగా మారింది అని ఆయన అన్నారు. వాటిని నెరవేర్చకుండా తిరిగి ఏ ముఖం పెట్టుకుని కలిశారు? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే ఆత్రుత చంద్రబాబుకు ఎక్కువైంది అని విమర్శించారు.. నిన్నటి ‘ప్రజాగళం’ సభ పూర్తిగా విఫలమైంది’ అని అన్నారు.అబద్ధాలు, మోసం, బాధ్యతారాహిత్యం వాళ్లలో కట్టొచ్చినట్లు కనిపిస్తోందని , కేవలం సీఎం జగన్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు .కనీసం దేశ ప్రధానిని సత్కరించేందుకు శాలువా, పుష్పగుచ్ఛం కూడా తీసుకురాని పార్టీలు అవేం భాగస్వామ్య పక్షాలంటూ రామకృష్ణ రెడ్డి ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news