నిన్నటి కోవిడ్-19 వివరాలను విడుదల చేసిన తెలంగాణ సర్కార్…!

-

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం నాటి కరోనా బులిటెన్ ను నేడు తాజాగా విడుదల చేసింది. ప్రతిరోజు లాగే పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య వివరాలను తెలిపే మీడియా బులిటెన్ ను నేటి ఉదయం కొత్త రూపంలో విడుదల చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే. తాజా బులెటిన్ ప్రకారం శనివారం నాడు 15,654 మందిని పరీక్షించగా అందులో 1,593 మందికి నిర్ధారణ అయిందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 998 మంది కరోనా బారినుండి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

coronavirus
coronavirus

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 12,264 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో ప్రస్తుతం రాష్ట్రంలోని హాస్పిటల్స్, వాటిలో ఉండే బెడ్ల సంఖ్య, ఐసీయూ లో ఎంత మంది చికిత్స పొందుతున్నారు అన్న పూర్తి విషయాలను తెలిపారు. వీటితోపాటు వివిధ జిల్లాలలో రాపిడ్ టెస్టులు జరుగుతున్న హాస్పిటల్స్ పూర్తి వివరాలను కూడా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news