పండగపూట విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి

-

పండుగ పూట క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్ అవి బరోట్ హతస్త్మత్తుగా మరణించాడు. 29 సంవత్సరాల వయసులో గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు అవి బరోట్. ఏదైనా చేసి ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటన చేసింది.

” ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాo. అవి బరొట్ అక్టోబర్ 15 సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. సౌరాష్ట్ర క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అతడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.

కాగా కుడి చేతి వాటం గల అవి బరొట్… అండర్ 19 క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా 2011 సంవత్సరంలో వ్యవహరించాడు. 2019 – 2020 సీజన్ కు గాను రంజీ ట్రోఫీ గెలిచిన జట్టు లో అవి ఒక్కడు. అవి బరోట్ 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడగా… 38 లిస్ట్ మరియు 20 దేశవాళీ ట్వంటీ-20 మ్యాచ్లో తన సత్తా చాటాడు. ఇక అవి బరోట్… మృతి పట్ల.. తోటి క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news