బీజేపీలోకి రాణి రుద్రమ..యువ తెలంగాణ పార్టీ విలీనం

-

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తయారు అవుతుంది. దుబ్బాక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ…. జీహెచ్‌ ఎంసీ, హుజురాబాద్‌ నియోజవర్గంలో గెలిచి… తెలంగాణ లో దూసుకుపోతుంది. రాష్ట్రంలో పార్టీని బలపేతం చేయడమే కాకుండా…తెలంగాణ ఉద్యమ నాయకులు, టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నాయకులను తమ పార్టీ లోకి లాగేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ.

ఈ నేపథ్యంలోనే.. యువ తెలంగాణ పార్టీని.. బీజేపీ లో విలీనం చేసుకునేందుకు రంగం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా…. జేపీ నడ్డా, తరుణ్ చుగ్ లకు యువ తెలంగాణ పార్టీ అధినేత జిట్టా బాలకృష్ణారెడ్డి లేఖ రాశారు. యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని లేఖలో పేర్కొన్నాడు జిట్టా బాలకృష్ణ. తమకు సీట్లు, పార్టీ లో ప్రాధాన్యత పై క్లారిటీ కోరిన జిట్టా… పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమని ప్రకటించాడు. అతి త్వరలో బీజేపీ నేతలతో సమావేశం కానున్న జిట్టా, రాణి రుద్రమ.. పార్టీని కూడా విలీనం చేయనున్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news