మహిళలకు భారీ షాక్..పెరిగిన బంగారం, వెండి ధరలు

-

బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం లో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరే దానికి లేదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగార, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు చాలా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు, వెండి ధరలు రెండూ భారీగా పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో బుధ వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 కు పెరిగి.. రూ. 48,760 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 కి తగ్గి.. రూ. 44,700 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌ల విషయానికి వస్తే… నిన్నటి కంటే రూ. 300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,600 కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news