వాయిదా ప‌డిన మెగాస్టార్ చిరంజీవి- వైఎస్ జ‌గ‌న్ భేటీ..

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి- టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి మధ్య నేడు జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈ ఉదయం వీరిద్దరూ భేటీ కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి, హీరో చిరంజీవి ఈనెల 14(సోమ‌వారం)న‌ భేటీ కానున్నారు.

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. జగన్ అపాయింట్‌మెంట్ కోరిన చిరంజీవి ఈ సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించేందుకే ఆయనను కలవబోతున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news