బ్రేకింగ్: జగన్ పెద్ద కుమార్తెకు పారిస్ బిజినెస్ స్కూల్‍ లో సీటు

-

ఏపీ సీఎం వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సాధించింది. ఆ యూనివర్సిటీ పారిస్ క్యాంపస్‌లో ఆమె మాస్టర్స్ డిగ్రీ చదవనున్నట్టు చెబుతున్నారు. ఇంతకు ముందే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ లో ఆమె గ్రాడ్యుయేషన్‌ చదివింది. దీంతో ఆ కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది.

Jagan
Jagan

ఇక ఆమె రేపు పారిస్‌ కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం జగన్ కుటుంబంతో సహా బెంగళూరు వెళ్లి అక్కడ నుండి హర్షా రెడ్డిని పారిస్‌కి పంపనున్నారు. ఇక ఆయన ఇద్దరు కూతుళ్ళు మార్చ్ నెలలోనే విదేశాల నుండి తిరిగి వచ్చారు. జగన్ చిన్న కూతురు హర్షా రెడ్డికి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో సీటు రావడంతో ఆమెని జాయిన్ చేయించేందుకు జగన్ కుటుంబం అమెరికా వెళ్లి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news