చంద్రబాబు ఫెయిల్యూర్ వల్లే సింగయ్య చనిపోయారు – వైఎస్ జగన్‌

-

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా నాకు Z+ సెక్యురిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సెక్యురిటీ ఫెయిల్యూర్ వల్లే అన్యాయంగా ఒకరు చనిపోయారన్నారు. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారని పేర్కొన్నారు.

jagan singaiah
jagan singaiah

వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్‌, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారన్నారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చానని వివరలించారు.

ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించామన్నారు. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం? అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news