ముఖ్యమంత్రికి గాలి మాటలు చెప్పడం తప్ప సాయం చేయడం చేతకాదు – వైఎస్ షర్మిల

-

బిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నేడు వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షానికి వేలాది ఎకరాలలో పంట నష్టపోయినా.. ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదని మండిపడ్డారు.

 

ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాలలో పంట నష్టపోయి, రూ. 1250 కోట్ల మేర నష్టపోయినా దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పంట నష్టానికి కూడా రూపాయి చెల్లించలేదని.. ముఖ్యమంత్రి, మంత్రులకు గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పడం తప్ప సహాయం చేయడం చేతకాదు అన్నారు. తక్షణమే రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news