సిట్ నోటీసులు అందలేదు – రేవంత్ రెడ్డి

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని అన్నారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీట్ సీరియస్ గా తీసుకుంది. రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్ ఏసీపీ కోరారు. రేవంత్ ఇటీవల పేపర్ లీక్ అంశంలో కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర కూడా ఉందన్నారు.

ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్. అయితే సిట్ జారీ చేసిన నోటీసులు ఇంకా తనకు అందలేదని అన్నారు రేవంత్ రెడ్డి. నోటీసులలో ఏముందో తనకు తెలియదని, అవి తనకు అందిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. నోటీసులకు భయపడేది లేదని అన్నారు రేవంత్ రెడ్డి. తమ దగ్గర ఉన్న ఆధారాలు సిట్ కు ఇవ్వమని, సిట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపితేనే ఇస్తామని పేర్కొన్నారు. ఈ కేసును కావాలనే నీరు గార్చె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news