కేసీఆర్‌పై షర్మిల ఫైర్‌…దొర గారిది “మేఘ” పరిపాలన

-

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా…. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

రూ. 38,500 కోట్లతో మొదలై లక్ష 20 వేల కోట్లకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు చేరుకొందని మండి పడ్డారు. ”ఒకవైపు .. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు… ఫీజు రీయింబర్స్‌మెంట్ కు పైసలు లేవు… రైతు రుణమాఫీకి డబ్బులు లేవు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్ముకోవాలి” అంటూ వైఎస్‌ షర్మిల మండి పడ్డారు.
మేఘా ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టడానికి మాత్రం కోట్లకు కోట్లు వస్తాయని… అప్పులు చేసి మరి కేసీఆర్‌ దొర పైసలు కుమ్మరిస్తారని ఫైర్‌ అయ్యారు. మీది దేశంలోనే అద్భుత “మేఘ” పరిపాలన దొర గారు అంటూ చురకలు అంటించారు వైఎస్‌ షర్మిల.త్వరలోనే సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ది చెబుతారని మండి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news