KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? : వైఎస్ షర్మిల

-

KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుందని.. చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుందని ఆగ్రహించారు. చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతున్నారని.. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా?అని నిలదీశారు వైఎస్ షర్మిల.

గడి గడపదాటి బయటకొచ్చి రైతును ఆదుకునేందుకు మనసొస్తలేదా? అని ప్రశ్నించారు. రైతు గోస వినపడ్తలేదా?చేతగాక పెడచెవిన పెడుతున్నావా?లేక మొద్దునిద్ర పోతున్నావా ? అని ఫైర్‌ అయ్యారు. అప్పులు తేవడానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్న మీరు….పంట కొనుమని అధికారులను ఎందుకు కల్లాలకు పంపడం లేదు? అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. ఇప్పటికైనా రైతును గోస పెట్టకుండా చూడండని.. తడిచిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా,కల్లాల్లో ధాన్యాన్ని మద్దతు ధరిచ్చి అంతా కొనాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news