నా తండ్రి హత్యను రాజకీయంగా జగన్ వాడుకున్నారు : వివేకా కుమార్తె సంచలనం

-

ఏపీ రాజకీయాల్లో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చాలా వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సీబీఐ అధికారులు చేతికి వచ్చాయి. అలాగే.. చాలా మందిని ఈ కేసులో.. సీబీఐ అధికారులు విచారించారు. ముఖ్యంగా.. వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిపైనే సీబీఐ అధికారులకు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. సీబీఐకి సునీత రెడ్డి గతంలో ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు ఇప్పుడు బయట పడ్డాయి. నా తండ్రి హత్యను రాజకీయంగా జగన్ వాడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ సునీత. తమ నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని… నాన్న హత్య పై భారతి, జగన్ చాలా తేలిగ్గా స్పందించారని వాంగ్మూలంలో సునీతా రెడ్డి పేర్కొన్నారు.

నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పానని ఆమె వెల్లడించారు. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని ఆమె తెలిపింది. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదని.. బీజేపీలో చేరతాడని జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు చెప్పినట్లు సునీతా రెడ్డి షాకింగ్‌ విషయాలు చెప్పారు. ఇప్పటికే మా పై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని సునీతా రెడ్డి వెల్లడించారు.

నా తండ్రి అంటే ఎంపీ అవినాశ్‍కు గిట్టదని.. అందుకే హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానని ఆమె వెల్లడించింది. తన తండ్రి హత్యను జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారన్న సునీత.. సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల అన్నారని తెలిపింది. అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని.. అవినాశ్‍రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని ఆమె గతంలో ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. ప్రస్తుతం సునీత ఇచ్చిన వాంగ్మూలం ఏపీ రాజకీయాను కుదిపేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news