వైఎస్ వివేకా కుటుంబానికి ప్రాణహాని !

-

వైయస్ వివేకా హత్య కేసు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో మరో ట్విస్ట్ నెలకొంది.. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైయస్ సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొన్న ఆమె…. ఈనెల 10న సాయంత్రం ఆ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ రెండు సార్లు తిరిగాడు లేఖలో వెల్లడించారు. ఆ వ్యక్తి ఇంటి కాంపౌండ్ తర్వాతి డోర్ దగ్గర ఆగి ఫోన్ కాల్ చేశాడని లేఖలో వివరించారు వైయస్ సునీత.

శివ శంకర్ రెడ్డి బర్త్ డే కోసం.. ఏర్పాటైన ఫ్లెక్సీ లోని వ్యక్తి లాగే ఆ అనుమానితుడు కనిపించాడని పేర్కొన్న ఆమె ఈ విషయాన్ని సీఐ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. చివరికి ఆ వ్యక్తి మణికంఠ రెడ్డి అని తేల్చారు అని పేర్కొన్నారు. శివశంకర్ రెడ్డికి మణికంఠ రెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్య కేసులో శివ శంకర్ రెడ్డి కీలకమైన అనుమానితుడిని… ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని శివశంకర్ రెడ్డి పాత్రను నిగ్గు తేల్చాలని కోరారు. అయితే వివేకా హత్య కేసులో ఈ రోజు సిబిఐ విచారణకు శివశంకర్రెడ్డి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version