`వైఎస్సార్ కంటి వెలుగు’కు ముహూర్తం ఫిక్స్‌..

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కంటివెలుగు’ పథకాన్ని ఏపీ సర్కార్ కూడా అమలు చేయనుంది. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద రూ.560 కోట్లతో కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం జిల్లాకు వచ్చే నెల 10న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని జిల్లా నుంచే సీఎం ప్రారంభించనున్నట్టు ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్యర్వంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ)లో మంత్రి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news