YSRCP 25 స్థానాలు గెలవడం కష్టమే.. ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

-

YSRCP ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ 25 స్థానాల్లో గెలవడం కూడా కష్టమేనని కొందరు పందెంరాయుళ్లు పందేలు కాస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. తమకు తామే సింహాలమని, వై నాట్‌ 175 అని బీరాలు పోతే ఆ సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ స్థానాల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు 30వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఇప్పటికే కొందరు పందేలు కాస్తున్నట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు రోడ్‌షోలకు హాజరవుతున్న జనసందోహాన్ని చూసైనా ఆత్మస్తుతి, పరనిందను మాని ప్రజలు ఎందుకు మనకు దూరం అవుతున్నారో ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ భూమి పుట్టాక తనలా సంక్షేమ పథకాలు ఎవరూ చేపట్టలేదని చెప్పుకునే జగన్‌.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ హాస్టల్‌ విద్యార్థినులు అన్నమో రామచంద్రా అని అడుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లాలో బాలికల వసతిగృహంలో స్నానాల గదులు లేక బెడ్‌షీట్లు అడ్డుగా కట్టుకొని లైట్లు ఆర్పి వేసి స్నానాలు చేయాల్సిన అగత్యం నెలకొన్నట్లు విద్యార్థినులు రోదిస్తున్నారని తెలిపారు. వారు సమస్యలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను ఆయన ప్రదర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news