ఢిల్లీ కోటలు బద్దలు కొడతా అన్న కేసీఆర్… వడ్లను కొనిపించ లేరా??- వైఎస్ షర్మిళ

-

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, రైతు మరణాలు, వడ్ల కొనుగోలు, నిరుద్యోగ సమస్యలపై పోరాడుతోంది వైఎస్ షర్మిళ.

తాజాగా ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ‘‘ రైతు చచ్చినా మాకు మా రాజకీయాలు కావాలి తప్పితే రైతు బతుకు గురించి ఆలోచించడం లేదు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల. రాష్ట్రంలో చివరి గింజ వరకు కొంటాం, అని మొన్నటివరకు చెప్పుకొన్న కేసీఆర్ గారు, కేంద్రంతో పంచాయితీ మొదలవ్వగానే యాసంగి కిరికిరి మొదలుపెట్టి కేంద్రం కొననంటుంది .అందుకే మేము కొనటం లేదని నాటకాలాడుతున్నరు. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం, మోడీని తరిమేస్తాం అని చెప్పుకొనే కేసీఆర్ గారు, రైతుల వడ్లు కేంద్రం చేత కొనిపించడం చాతకాదా? మీవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనా? మీకు దమ్ముంటే రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనండి. కేంద్రం మెడలు వంచి కొనిపించండి’’ అంటూ విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news