రిషబ్ పంత్​ను కలిసిన యువరాజ్ సింగ్.. ‘ఛాంపియన్ రెడీ’ అంటూ పోస్టు

-

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్​ రిషభ్ పంత్​ను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కలిశాడు. గతేడాది డిసెంబర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్​ను యువరాజ్ పరామర్శించాడు. అతడితో కాసేపు ముచ్చటించాడు. ఈ విషయాన్ని యువరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. పంత్​తో దిగిన సెల్ఫీని షేర్ చేసుకున్నాడు.

“ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఈ ఛాంపియన్‌ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు” అంటూ రిషభ్‌ పంత్‌తో దిగిన లేటెస్ట్​ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ క్రమంలో రిషబ్ ఆత్మవిశ్వాసాన్ని చూసి మురిసిపోయిన యువీ.. రిషభ్‌ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడని, నెగిటివ్​ ఆలోచనలు దరిచేరనీయడంటూ కొనియాడాడు. త్వరగా కోలుకుని తిరిగి మునపటిలా మారాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది.

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ రిషభ్ పంత్‌ రోడ్డు ప్రమాదం తర్వాత స్టిక్​ సహాయంతో ఇప్పుడిప్పుడే నడవడం కూడా మొదలుపెట్టాడు. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు.

Read more RELATED
Recommended to you

Latest news