టీటీడీ ఛైర్మ‌న్‌గా మ‌రోసారి వైవీ సుబ్బారెడ్డి

-

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ గా మరోసారి వైసీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన త్వరాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ గా సుబ్బారెడ్డిని నియమించింది.

ఇటీవలే ఆయన పదవీకాలం పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కొత్త వ్యక్తికి తిరుమల తిరుపతి దేవ స్థానం ఛైర్మన్‌ గా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ మళ్లీ సుబ్బారెడ్డినే నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక త్వరలోనే టీటీడీ బోర్డు ఛైర్మన్‌ గా వైవీ సుబ్బారెడ్డి నియామకం కానున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఇటీవలే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నామినేటేడ్‌ పదవుల జాతర జరిగిన సంగతి తెలిసిందే. ఈ నామినేటేడ్‌ పదవుల్లో చాలా మందికి పదవులు కట్టబెట్టింది ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news