జడ్పీ ఛైర్మన్‌, ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

-

జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ తుది దశకు చేరుతోన్న నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మరియు మరియు పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నిక కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. దీంతో ఈ నెల 24 న ఎంపీపీ ల ఎన్నిక మరియు ఈ నెల 25 వ తేదీన జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ లో పేర్కొంది.

జడ్పీటీసీ గా గెలిచిన వారంతా ఛైర్మన్‌ మరియు వైస్‌ ఛైర్మన్లను… ఎంపీటీసీ గా గెలిచిన వారు మండల పరిషత్‌ అధ్యక్ష మరియు ఉపాధ్యక్షులను ఎన్నికోనున్నారు. కాగా.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తం గా జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం లోపు అన్ని ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news