అమెరికాలో ముగ్గురు హైదరాబాద్ వాసుల మృతి

-

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరితో పాటే తమిళనాడు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ పాలచర్ల, ఫరూఖ్, ఆర్యన్ రఘునాథ్‌తో పాటు తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవ్ కూడా ఉన్నారు. అయితే, వీరంతా కారు ప్రమాదంలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకే సారి 5 వాహనాలు ఒకదానికొకటి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో కార్ పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా మృతులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఈ మధ్యకాలంలో విదేశాల్లో చదువుకోసం, ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. వీరంతా అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొందరు అడ్వెంచర్స్ చేస్తూ ప్రమాదానాలను కొనితెచ్చుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version