ట్విట్టర్​పై ఎలాన్​ మస్క్​ కౌంటర్ దావా

-

అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, మైక్రో బ్లాగింగ్‌ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్‌ వార్‌ మరింత ముదురుతోంది. ట్విట్టర్​తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేశారు.

తాజాగా ట్విట్టర్ దావాను సవాల్‌ చేస్తూ మస్క్ కూడా కౌంటర్‌ దావా వేశారు. ట్విట్టర్ దావాపై ఈ ఏడాది అక్టోబరులో విచారణ జరపనున్నట్లు డెలావర్‌ కోర్టు ఆదేశాలు వెలువరించిన కొద్ది గంటలకే మస్క్‌ ఈ దావా వేయడం గమనార్హం.

ఈ దావాపై ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ షేరు విలువ 41.61 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విట్టర్ షేర్లు భారీగా పతనమవ్వగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్నాయి.

ట్విట్టర్​ను 44 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రకటించారు. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది.

Read more RELATED
Recommended to you

Latest news