జియో దీపావళి ఆఫర్.. రూ.699కే జియో ఫోన్..!

-

రిలయన్స్ జియో తన జియో ఫోన్‌ను రూ.1500కు బదులుగా కేవలం రూ.699కే అందిస్తోంది. అయితే వినియోగదారులు ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన పనిలేదు.

రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఎన్ని సంచనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. తక్కువ ధరలకే 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న జియో.. తరువాత జియో ఫోన్‌ను లాంచ్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. కేవలం రూ.1500కే 4జీ ఫీచర్‌ఫోన్‌ను అందించింది. అయితే ఇప్పుడా ఫోన్‌ను కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు.

Reliance Jio offers jio phone for rs 699 only

రిలయన్స్ జియో తన జియో ఫోన్‌ను రూ.1500కు బదులుగా కేవలం రూ.699కే అందిస్తోంది. అయితే వినియోగదారులు ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన పనిలేదు. డైరెక్ట్‌గా రూ.699 పెట్టి జియో ఫోన్ కొనవచ్చు. ఇక ఈ ఫోన్‌కు గాను మొదటి 7 రీచార్జిలకు జియో అదనంగా రూ.99 విలువైన డేటాను అందివ్వనుంది. దీంతో ఫోన్ కొనుగోలులో రూ.800, 7 రీచార్జిల విలువ రూ.700 మొత్తం కలిపి రూ.1500 వినియోగదారులు ఆదా చేయవచ్చు.

దసరా, దీపావళి పండుగల సందర్భంగా జియో పైన చెప్పిన ఆఫర్‌ను అందిస్తోంది. దీపావళి పండుగ వరకు మాత్రమే.. స్టాక్ ఉన్నంత వరకు ఈ ఫోన్‌ను రూ.699 ధరకు అందివ్వనున్నారు. కనుక.. మీకు కూడా ఫోన్ కావాలంటే త్వర పడండి మరి..!

Read more RELATED
Recommended to you

Latest news