నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ ఏపీ ప్రభుత్వం.. 2,500 పోస్టులు భర్తీ

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపికబురు అందించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిని సారించిన ఏపీ సీఎం జగన్ స‌ర్కార్‌ త్వరలోనే అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020 జనవరిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అటవీ శాఖలో సిబ్బంది కొరత అధిగమించేందుకు నియామకాలు చేపడుతున్నట్టు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు.

విశాఖ జిల్లా కాంబాలకొండలో జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ శాఖ సిబ్బంది కొరత ఎదుర్కొంటుందని.. దానిని అధిగమించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని…అధునాతన ఆయుధాలు సమకూరుస్తామన్నారు. ఇక త్వరలోనే అటవీ అధికారులకు నూతన ఆయుధాలు, వాహనాలు అందచేయనున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news