ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..నెలకు రూ.4,500 పొందొచ్చు..!

-

ఉద్యోగులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందలేకపోయిన వాళ్లకి గుడ్ న్యూస్ ని అందించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఉద్యోగుల ఇప్పుడు వారి చిల్ట్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ అలవెన్స్ ని తక్కువ పేపర్ వర్క్ తో నివేదికలు చేసుకోచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అలవెన్స్ పిల్లల చదువు కోసం అందిస్తున్న సంగతి తెలిసిందే. 7వ వేతన సంఘం ప్రకారం నెలకు రూ.2,250 చిల్ట్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందవచ్చు. ఇలా గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఈ బెనిఫిట్ క్లెయిమ్ చెయ్యచ్చు.

అంటే రూ.4,500 వరకు వస్తాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ క్లెయిమ్ ని కరోనా వలన క్లెయిమ్ చెయ్యడానికి అవ్వదు. స్కూళ్లు క్లోజ్‌లోనే ఉన్నాయి కనుక. అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్లతో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఇబ్బంది అవ్వదు.

ట్యూషన్ ఫీజు వంటి డాక్యుమెంట్లు లభించలేదు. గతం లో చూసుకున్నట్టయితే ఎక్కువ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉండదు. అలానే ఫీజు రశీదు వంటివి కావాల్సి వచ్చేవి. కానీ ఇప్పుడు సులభం చెయ్యడానికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్‌ను సెల్ఫ్ డిక్లరేషన్ లేదా రిజల్ట్/రిపోర్ట్ కార్డ్/ ఫీజు చెల్లింపు ఎస్ఎంఎస్/ఈమెయిల్ వంటి వాటిని ప్రింట్ తీసుకొని ఇస్తే క్లెయిమ్ చేసుకోవచ్చని అంది.

Read more RELATED
Recommended to you

Latest news