పీఎన్‌బీకి భారీ జరిమానా.. కారణం ఇదే..!

-

రిజర్వు బ్యాంకు ప్రభుత్వ రంగానికి చెందిన పీఎన్‌బీకి భారీ జరిమానా విధించింది. ఇందుకు కారణం ఆ బ్యాంకు ఏటీఎంకు సంబంధించి రూల్స్ ను ఉల్లఘించటమే. దీంతో పాటు ఆర్‌బీఐ పలు సంస్థల సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్ ను రద్దుచేసింది. ఎందుకు ఆర్‌బీఐ ఇంతమొత్తంలో జరిమానా విధించింది. పీఎన్‌బీ చేసిన ఆ తప్పుఏంటో తెలుసుకుందాం రండి.ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రభుత్వ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆర్‌బీఐ అదిరిపోయే షాక్ ఇచ్చింది. దీంతో పలు బ్యాంకులు తమ సర్టిఫికెట్లను రద్దు చేసుకున్నాయి.

rbi
rbi

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన అంతర్జాతీయ అనుబంధ బ్యాంక్ డ్రక్ పీఎన్‌బీ (భూటాన్)తో ద్వైపాక్షిక ఏటీఎం షేరింగ్ అగ్రిమెంట్‌ను కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గమనించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలా చేయాలంటే ముందుగానే ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ తీసుకోలేదు. 2010 ఏప్రిల్ నుంచి పీఎన్‌బీ ఇలా చేస్తూ వస్తున్నట్లు ఆర్‌బీఐ తేల్చింది. అందుకే ఇప్పుడు ఆర్‌బీఐ పీఎన్‌‌పై జరిమానా విధించింది.కోటి రూపాయిల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 26(6) కింద ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే మరి కొన్ని సంస్థలకు కూడా షాకిచ్చింది. ఐదు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు సంబంధించిన సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తునట్లు ప్రకటించింది. ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ జారీ చేసేవి. ఇన్‌క్యాష్ మి మొబైల్ వాలెట్ సర్వీసెస్, సర్టిఫికెట్స్ ఆఫ్ కార్డ్ ప్రో సొల్యూషన్స్, అనే సంస్థలకు సీఓఏను ఆర్‌బీఐ రద్దు చేసింది. మరో రెండు సంస్థలు వారి సర్టిఫికెట్స్‌ను అవే వెనక్కి తీసుకున్నాయి. మరో సంస్థ సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోకపోవడంతో రద్దు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news