IRCTC: హైదరాబాద్ నుంచి కాశీ టూర్ ప్యాకేజ్..!

-

IRCTC హైదరాబాద్ నుంచి గంగా గయ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దీనిలో బోధ్‌గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్ కూడా వున్నాయి. 2021 సెప్టెంబర్ 22నఈ టూర్ మొదలవుతుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఇక ఈ టూర్ ప్యాజీకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

ఐఆర్‌సీటీసీ గంగా గయ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.24,660. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25,450, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,020 చెల్లించాలి. ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తో పాటుగా హైదరాబాద్ నుంచి గయకు, వారణాసి నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ టికెట్స్, ఒక రోజు బోధ్ గయలో బస, మూడు రోజులు వారణాసిలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఇందులోనే.

IRCTC
IRCTC

మొదటి రోజు అనగా సెప్టెంబర్ 22 ఉదయం 6.25 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.30 గంటలకు గయ రీచ్ అవుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. నెక్స్ట్ మహాబోధి ఆలయం, పరిసర ప్రాంతాల్లోని బౌద్ధ ఆలయాలు చూడచ్చు.

రెండో రోజు తెల్లవారుజామున విష్ణుపాదం ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తరువాత వారణాసికి బయల్దేరాలి. ఇక మూడవ రోజు కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి ఆలయం, భూ ఆలయం చూడచ్చు. సాయంత్రం గంగా హారతి కూడా చూడచ్చు.

నాలుగో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. త్రివేణి సంగమం, అలోపి దేవీ ఆలయం, ఆనంద్ భవనం చూసి వారణాసికి తిరిగి రావాలి. ఐదో రోజు ఉదయం గంగా స్నానానికి వెళ్లొచ్చు. మధ్యాహ్నం సార్‌నాథ్‌కు బయల్దేరాలి. దమేఖ్ స్తూపాన్ని చూసి రాత్రి 8 గంటలకు వారణాసిలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10.10 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news