మ‌నీ ట్రాన్స్ ఫ‌ర్ చేసుకునేవారికి గుడ్‌ న్యూస్‌..

-

మ‌నీ ట్రాన్స్ ఫర్ చేసుకునే వారికి ఆర్బీఐ గుడ్‌ న్యూస్ ప్ర‌క‌టించింది. సాధార‌ణంగా ఇంతకుముందు 7.45 గంటలు మాత్రమే నెఫ్ట్ సేవలు ఉండేవి. కానీ ఇప్పటి నుంచి 24గంటల పాటు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని అక్టోబ‌ర్ 4 శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది. ప్రజలకు డబ్బు ట్రాన్స్ ఫర్ విషయంలో ఇబ్బందులు లేకుండా, ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్లను అర్థం చేసుకున్న ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఆర్బీఐ చెప్పిన ఈ నిర్ణయంతో మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్లు సులభతరంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news