నెలకు కేవలం రూ.210 పెట్టి.. రూ.5 వేలు పెన్షన్ పొందండి..!

-

మీరు ప్రతీ నెలా డబ్బులను పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు ఈ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఈ స్కీమ్ లో కనుక డబ్బులు పెడితే మంచిగా డబ్బులొస్తాయి. మనకోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చింది. అయితే ఆ స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి.

money
money

ఇందులో డబ్బులు పెడితే ప్రతీ నెలా రూ.5,000 పెన్షన్ వస్తుంది. పూర్తి వివరాల లోకి వెళితే..ఈ స్కీమ్ లో నెలకు రూ.210 పెట్టుబడి పెట్టాలి. ఆ తరవాత ప్రతీ నెలా పెన్షన్ వస్తుంది. అసంఘటిత రంగంలోని పేదవారు, కూలీలు, శ్రామికులు, కార్మికులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు.

18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు ఈ స్కీములో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలి. ఈ స్కీమ్ లో రూ.1000 మొదలు రూ.5,000 దాకా నెలవారీ పెన్షన్ ని పొందొచ్చు.

పెన్షన్ పొందే వ్యక్తి చనిపోతే వచ్చే నెల నుంచి ఆ వ్యక్తి భార్యకు అదే నెలవారీ పెన్షన్ ఇస్తారు. 18 ఏళ్ల వయసప్పుడు అటల్ పెన్షన్ యోజన అకౌంట్ తెరిస్తే నెలకు రూ.42 చొప్పున చెల్లించాలి. తద్వారా మీకు 60 ఏళ్లు దాటాక నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ వస్తుంది.

ఒకవేళ కనుక రూ.7చొప్పున నెలకు రూ.210 చెల్లిస్తూ పోతే మీకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ వస్తుంది. నెలకు రూ.84 చెల్లిస్తూపోతే రిటైర్మెంట్ తర్వాత మీకు నెలకు రూ.2,000 పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news