అదిరే స్కీమ్.. రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు పొందొచ్చు..!

-

మీరు ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీని కోసం తెలుసుకోవాలి. పోస్టాఫీస్‌లో ఎన్నో రకాలు సేవలని అందిస్తోంది. అయితే కొన్ని స్కీమ్స్ కూడా వున్నాయ్. ఈ స్కీమ్స్ లో కనుక డబ్బులు పెడితే ఎలాంటి నష్టం ఉండదు. మంచి రాబడిని పొందొచ్చు. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ స్కీమ్స్ గురించి చూసేద్దాం.

 

Postoffice
Postoffice

పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్‌ లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. ఏ రిస్క్ లేకుండా మంచి రాబడి పొందాలంటే ఇది బెస్ట్. ఈ పథకంలో చేరడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే మీరు రూ.లక్ష పెడితే.. మీకు రూ.2 లక్షలు వస్తాయి. డబ్బు డబుల్ అవుతాయి. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.

కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరిన వారి డబ్బు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం కేవీపీ స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ వస్తోంది. ఈ అకౌంట్ ని కనుక తెరవాలంటే పిల్లల పేరుపై కూడా తెరవచ్చు. ఆధార్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్ల ద్వారా పోస్టాఫీస్‌కు వెళ్లి అప్లికేషన్ ఫిల్ చేసి స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్ లో కనీసం రూ.1000 నుంచి కూడా డబ్బులు పెట్టొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇలా ఇన్వెస్ట్ చేసి ఏ రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news