మధ్యప్రదేశ్ లో అందమైన హిల్ స్టేషన్లు.. సమ్మర్ ట్రిప్ కు కరెక్ట్ స్పాట్..!

-

సమ్మర్ లో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఓ సారి మధ్యప్రదేశ్ వైపు లుక్కేయండి. ఇక్కడ హిల్ స్టేషన్లు చాలా అందంగా ఉంటాయి. మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో వెళ్లి ఎంచక్కా ఎంజాయ్ చేసి రావొచ్చు. ఈరోజు మధ్యప్రదేశ్ లో ని హిల్ స్టేషన్లు గురించి చూద్దాం..

శివపురి హిల్ స్టేషన్

ఈ రాష్ట్రంలోనే ఇది ఫేమస్… ఇది సముద్ర మట్టానికి దాదాపు 462 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మెరిసే సరస్సులకు ప్రసిద్ధి. ఇందులో జాదవ్ సాగర్ లేక్, చాంద్‌పథ లేక్ ఉంటాయి. శివపురిలో చూడదగిన ప్రదేశాలలో మాధవ్ నేషనల్ పార్క్, బంగంగా టెంపుల్ ఉంటాయి. బోట్ రైడ్‌ కూడా ఇక్కడ అవైలబుల్ గాఉంటుంది.

తమియా హిల్ స్టేషన్

ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. సమ్మర్ లో వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇది కరెక్ట్ స్పాట్… ఇక్కడ పాతాల్‌కోట్ వ్యాలీ, ట్రైబల్ మ్యూజియం, సన్‌సెట్ మ్యూజియం ఉంటాయి.

మండు హిల్ స్టేషన్

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన హిల్ స్టేషన్‌లలో మండూ హిల్ స్టేషన్ కూడా ఒకటి. ఇక్కడ ప్రకృతి అందాలను మిమ్మల్ని కట్టిపడేస్తాయి. పర్యాటకులు ఎక్కువగా ఈ హిల్ స్టేషన్ కే వస్తుంటారు. ఇక్కడ అనేక రాజభవనాలు, పురాతన స్మారక చిహ్నాలు ఉన్నాయి.. చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం బాగా నచ్చుతుంది.. ఇక్కడ ఒక సరస్సు కూడా ఉంటుంది. ప్రేమ జంటలకు ఇది మంచి ప్లేస్. నర్మదా నది అందాలను చూసి ఆస్వాదించవచ్చు. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు.

వీటితో పాటు.. మధ్యప్రదేశ్ లోని..‌ ఓంకారేశ్వర్ కొండ ఓంకారేశ్వర ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం శివునికి అంకితం చేశారట… 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చి శివుడి దర్శించుకుంటారు. అమరేశ్వర్ అనే మరో పురాతన దేవాలయం కూడా ఇక్కడ చూడొచ్చు. మమలేశ్వర్ జ్యోతిర్లింగ్, గోముఖ్ ఘాట్‌లను యాత్రికులు బాగా సందర్శిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news