హైదరాబాద్ లో వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన యువ‌కుడు..

-

హైదరాబాద్ లో ఆదివారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ సమయంలో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఎలిబీనగర్ ప్రాంతంలో నీళ్లు రోటీలను ముంచేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో లింగోజి గూడ డివిజన్ కాకతీయ కాలనీ లోని ఏడో నెంబరు రోడ్డు నీట మునిగింది.

అప్పుడే ఆరోడ్డున వెడుతున్న ఓ మహిళా(30 ) వర్షపు నీటిలో చిక్కుంది. ఆ నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకు పోవడం మొదలైంది. అదే రోడ్డులో ఓ భవనం లో నివాసముంటున్న ప్రశాంత్ దీనిని గమనించారు. వెంటనే కిందకు దిగి వచ్చి ఆ మహిళకు చేయి అందించి ఆమెను సురక్షితంగా లాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇక అక్కడి స్థానికులు అందరూ ప్రశాంత్ ను ప్ర‌శంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news