కరోనా మహమ్మారి కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే లక్షల మంది ప్రజలు దీని బారిన పడగా, వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రజప్రతినిధులు సైతం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని సూచించారు. అయితే ఇప్పుడు ఈ మహమ్మారి సెగ జైళ్లకు సైతం తాకింది. ఇప్పటికే దేశంలోని కొన్ని జైలల్లో కరోనా వ్యాపించింది. అలాగే ఇటీవల తిరుపతి సబ్ జైల్లో ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. ఓ కిడ్నాప్ కేసులో విజయవాడ జైలు నుండి రాజమండ్రి జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీకి ఆరోగ్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో జైలు సిబ్బంది, తోటి ఖైదీల్లో ఆందోళన నెలకొంది. కాగా ఆ నిందితుడిని ఆసుపత్రికి తరలించగా జైలును శానిటైజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ఆ నిందితుడిని తీసుకువచ్చిన పోలీసులను క్వారంటైన్ చేశారు.
రాజమండ్రి జైలులో కరోనా కలకలం..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధం – విజయసాయి
అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధం అన్నారు వైసీపీ...
లోక్సభ మూడో దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటల...
కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి నేనే వెళ్లమన్నా.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్...