గవర్నర్‌తో ముగిసిన సీఎం‌ జగన్‌ భేటీ.. ఈ అంశాలపైనే చర్చ..!

-

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ సమావేశాల అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారు. దానిలో భాగంగానే సీఎం జగన్‌ సమావేశమైనట్లు తెలుస్తోంది.

అలాగే వీరి మధ్య తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపిక అయిన సభ్యుల గురించి సీఎం జగన్ ను గవర్నర్ అడిగినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వ చేపడుతున్న చర్యలు, పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలపై కూడా గవర్నర్‌తో భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. కాగా సీఎం జగన్ వెంట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news