ఆత్మనిర్భర్ భారత్ లోగో తయారీ కంటెస్ట్, విజేతకు 25 వేల బహుమతి..!

-

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆత్మనిర్భర్ భారత్ లోగో తయారీ కంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కంటెస్ట్‌లో గెలిచిన వారికి రూ.25000 బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకుగాను మీరు తయారు చేసిన లోగోను JPEG, PNG or PDF ఫార్మాట్లలో mygov.inలో అప్‌లోడ్ చెయ్యవచ్చని సూచించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12న ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో దేశ ప్రజలు స్థానికంగా తయారుచేసిన వస్తువుల్నే కొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

narendra modi
 

తద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందన్నారు. మీరు లోగో పంపడానికి చివరి తేదీ… ఆగస్ట్ 24. ఆ రోజు రాత్రి 11.45 లోపు మీరు లోగోను అప్‌లోడ్ చెయ్యవచ్చు. లోగోతోపాటూ… మీ ప్రొఫైల్ కూడా పంపాల్సి ఉంటుంది. మీ రేపు, తాజా ఫొటో, పూర్తి అడ్రెస్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటివి ఇవ్వాలి. జేతకు గెలిచినట్లు చెబుతూ ఈమెయిల్ పంపుతారు. అలాగే… మై గవ్ బ్లాగ్ పేజీలో విజేత పేరును ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news