బిగ్ బ్రేకింగ్: కేరళలో ఘోర విమానం ప్రమాదం, రెండు ముక్కలైన విమానం…వీడియో !

-

కేరళలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. వందే భారత్ మెషిన్ లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న విమానం రన్ వే పై క్రాష్ అయింది. ఈ విమానంలో 192 మంది ఉన్నారు. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పింది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలు అయింది. కోజీకోడ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి అంబులెన్స్ లతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుంది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగంగా పూర్తిగా ద్వంశం అయింది. అయితే కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తుంది. పైలెట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 20 అంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

వర్షం కారణంగా స్కిడ్ అయింది అని అక్కడ చూసిన వారు చెప్తున్నారు. వెనుక భాగంలో ఉన్న వారికి మాత్రం ఏ ప్రమాదం జరగలేదు అని అంటున్నారు. 90 మందికి గాయాలు అయ్యాయి అని అక్కడ ఉన్న వారు చెప్తున్నారు. కరోనా కారణంగా తక్కువ మంది ఉండటంతో ప్రాణాపాయం కాస్త తప్పింది అని అంటున్నారు. వాతావరణ సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కేరళలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పైలెట్ అనవసరంగా విమానం ల్యాండ్ చేసారు అని, గాల్లోనే కాసేపు చక్కర్లు కొట్టాల్సింది అని నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news