ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కోవిడ్‌-19 కారణంగా తాజాగా 97 మంది చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 2,17,040 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,29,615 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 1,939 మంది మృతి చెందగా.. ప్రస్తుతం 85,486 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news