డేంజర్ బెల్స్.. భారత్ లో భారీగా పెరిగిన కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 97,570 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,201 మంది మరణించారు.

దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 46,59,985 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 77,472 కి పెరిగింది. నిన్న 81,533 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 36,24,197 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,58,316 యాక్టివ్ కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news