అడివిశేష్ హీరోయిన్ అన్ సెన్సార్డ్ షో!

-

`గూఢ‌చారి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది శోభితా ధూళిపాల‌. తెలుగ‌మ్మాయే అయినా ముందు ర‌చ్చ గెలిచి ఆ త‌రువాత ఇంట గెల‌వాని ముందు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ త‌రువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలో హాట్ స‌న్నివేశాల‌తో పాటు లిప్‌లాక్ సీన్‌ల‌లోనూ ఎలాంటి బెరుకు లేకుండా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన `ర‌మ‌న్‌రాఘ‌వ్ 2.O`లోనూ న‌వాజుద్దీన్ సిద్ధిఖీతో క‌లిసి రోమాన్స్ చేసింది. అక్క‌డి నుంచి సోష‌ల్ మీడియాలో వ‌రుస హాట్ షోతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. తెలుగ‌మ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌ని భ‌య‌ప‌డ‌తార‌నే పేరుండేది కానీ ఆ పేరుని శోభిత త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో చెరిపేసింది. తాజాగా క‌మ‌ర్షియ‌ల్ మ్యాగ‌జైన్ బజార్ ముఖ‌చిత్రంపై రెచ్చిపోయి క‌నిపించింది. న‌డ‌ము పై భాగం వ‌ర‌కు మాత్ర‌మే డ్రెస్ ధ‌రించి ఆ త‌రువాత ఎలాంటి క్లాత్స్ లేకుండా కాళ్లు పైకెత్తి శోభిన విచిత్ర‌మైన భంగిమ‌లో ఫొటోల‌కు పోజులిచ్చిన తీరు ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తోంది.

అన్ సెన్సార్డ్ పిక్ కుర్ర హృద‌యాల్ని క‌కావిక‌లం చేస్తోంది. బజార్ ఇండియా తాజా సంచిక క‌వ‌ర్ పేజీపై ఓ కాలు పైకెత్తి నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకుని శోభిత క‌వ్విస్తున్న ఫొటో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. తెలుగ‌మ్మాయి తెగింపుకు బాలీవుడ్ జ‌నాలు అవాక్క‌వుతున్నారు.

B

Read more RELATED
Recommended to you

Latest news