డేట్ ఫిక్స్: తమ్ముళ్లకు గుడ్ న్యూస్.. జనాల్లోకి చంద్రబాబు!

-

గతకొంతకాలంగా భాగ్యనగరంలో ఉంటే ఏపీలో పార్టీనీ, కార్యకర్తలను అభాగ్యులుగా వదిలేశారనే విమర్శను సంపాదించుకున్న చంద్రబాబు.. ఇక జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు! ఎంతకాలం మాత్రం ఇంట్లో ఉంటారు.. అసలే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని బాబు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సమయంలో ఇంక ఇంట్లో ఉంటే కాదు.. జనాల్లోకి వస్తున్నానని మాట ఇచ్చారు చంద్రబాబు!

అవును… తాజాగా టీడీపీ నేతలతో జరిగిన ఆన్ ‌లైన్‌ సమావేశంలో బాబు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. తాను రాష్ట్రమంతా తిరిగి ప్రజలను కలుస్తానని.. కష్టాల్లో ఉన్నవారి కోసం గళం విప్పుతానని.. వారి తరపున పోరాడతానని హామీ ఇచ్చారు చంద్రబాబు! దీంతో ఏపీలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు!

ఇక తాను రాష్ట్రమంతా తిరగడానికి దాదాపు డేట్ కూడా ఫిక్స్ చేసినంతపనిచేశారు చంద్రబాబు! కాకపోతే… కరోనా తగ్గి వ్యాక్సిన్ రావడమే ఆలస్యం..! అవును… కరోనా తగ్గిన వెంటనే తాను జనాల్లోకి వస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు! అయితే… ఈ విషయాలపై కొందరు తమ్ముళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. “కరోనా పోయేదెప్పుడు.. ఆయన వచ్చేదెప్పుడు..?” అని! మరికొందరైతే… “క‌రోనా పూర్తిగా పోయేది లేదు.. బాబు ఏపీకి వ‌చ్చేది లేదు” అని ఫిక్సయిపోయారంట!

కానీ… ఆశాజీవులు మాత్రం.. “ఒక ఏడాది అటో ఇటో కరోనా పూర్తిగా తగ్గుతుంది.. వ్యాక్సిన్ కూడా వస్తుంది.. బాబు కూడా జనాల్లోకి వస్తారు” అని అంటున్నారంట!! ఈ మాత్రం హోప్ చాలు.. బాబు ఆన్ లైన్ పాలిటిక్స్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news