దోస్త్ గడువు అక్టోబర్ 9వరకు పెంపు !

-

తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ గడువు అక్టోబరు 6తో ముగియనుండగా దాన్ని 9వ తేదీ వరకు పొడిగించారు. వెబ్ ఆప్షన్ల గడువు 10వ తేదీ వరకు ఉంటుంది. సీట్లను 15వ తేదీన కేటాయిస్తారు. మూడో విడత పూర్తయిన తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ను దృష్టిలో పెట్టుకొని మరో విడత ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నామని కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి ప్రకటించారు.


అందుకు అక్టోబరు 15 నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వారికి అక్టోబరు 30వ తేదీన సీట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని సుమారు వెయ్యికాలేజీల్లో సుమారు మూడులక్షలకు పైగా డిగ్రీ సీట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news