వేరుశనగ పంట చూస్తే బాధేస్తోంది : లోకేష్

-

ఇటీవలే తెలుగు రాష్ట్రాలను అతి భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ పంట నష్టం వాటిల్లింది . అయితే ఇటీవలే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలో పర్యటిస్తూ పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

lokesh

ఈ సందర్భంగా భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల కారణంగా తీవ్రంగా ధ్వంసమైన పంటలను పరిశీలించిన ఆయన వేరుశనగ పంటను చూస్తే తనకు ఎంతో బాధ కలుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఓట్లు అడిగేటప్పుడు పాదయాత్ర పేరుతో ఊరూరా తిరిగారు కానీ ప్రస్తుతం వర్షాలతో రైతులు పంట నష్టపోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కనీసం వారిని పరామర్శించడానికి కూడా రాలేదు అంటూ విమర్శించారు నారా లోకేష్. రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే జగన్ కు కనీసం రాయలసీమ రైతుల కష్టాలు కూడా పట్టవా అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news