బ్రేకింగ్: భారత్ లోకి డ్రోన్ పంపిన పాకిస్తాన్…?

-

భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి అలజడి రేగింది. జమ్మూ కాశ్మీర్‌ లోని పూచ్ జిల్లాలోని మేంధర్ సెక్టార్‌ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) సమీపంలో ఆదివారం ఉదయం ఎగిరే వస్తువు ఒకటి కనిపించింది. ఈ వస్తువు భారత భూభాగంపై ఎగురుతూ కనిపించింది. అయితే, ఆ వస్తువు డ్రోనా లేక మరొకటా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇది ఏంటీ అనే దానిని గుర్తించడానికి భారత ఆర్మీ ప్రయత్నిస్తుంది.Drones and Unmanned Aerial Vehicle (UAV) Certification | UL

గత నెలలో, జమ్మూ కాశ్మీర్ కేరన్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ క్వాడ్కాప్టర్ను భారత సైన్యం పేల్చేసిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన డీజేఐ మావిక్ 2 ప్రో మోడల్ తయారుచేసిన పాకిస్తాన్ క్వాడ్‌కాప్టర్ భారత భూభాగం మీదుగా ఎగురుతున్నప్పుడు కాల్చేశారు. కాగా సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇటీవల వరుస కాల్పులకు దిగుతున్న సంగతి విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news