పెళ్లి చేసుకోనందని చంపేశాడు.. రెండు నెలల తరువాత కనిపెట్టిన పోలీసులు !

-

రెండు నెలల క్రితం జరిగిన మహిళ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. ముందు మహిళది సహజ మరణంగా భావించినా, పోస్టుమార్టం రిపోర్టు ఇతర అనుమానాలతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఎలాంటి క్లూ లేకున్నా రెండు నెలల పాటు నిందితుడి కోసం గాలించిన పోలీసులు,  మహారాష్ట్రకు చెందిన నిందితుడు వినోద్‌ ను షామీర్పేట్ లో పట్టుకున్నారు.

murder
murder

ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే రెండు నెలల క్రితం సంతోషి అనే వివాహిత మృత్యువాత పడింది. ముందు సహజ మరణమే అనుకున్నా ఆమె వద్ద పని చేసే ఒక వ్యక్తి మిస్ కావడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. చివరికి అతనే చంపినట్టు గుర్తించాడు. సంతోషితో నిందితుడు వినోద్ వివాహేతర సంబంధం కొనసాగేది. పెళ్లి చేసుకుందామని సంతోషిని,  వినోద్ చాలా సార్లు అడిగాడు, కానీ దానికి ఆమె నిరాకరించింది. దీంతో తనతో పాటు మరెవరితోనైనా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందన్న అనుమానంతో ఆమెను తీసుకెళ్లి హత్య చేసిన వినోద్ పారిపోయినట్టు పోలీసులు తేల్చారు.   

Read more RELATED
Recommended to you

Latest news